Friday, February 6, 2015

7th month - Pregnancy

గర్భిణీ స్త్రీ ఏడవ నెల పొడుగునా అన్నివిధాలైన అన్నాలనీ తినాలంటోంది లలితా సహస్రనామం. అంటే 
  1. ఒక పాయసాన్నపు ముద్ద,
  2. ఒక పెసరపప్పు నేతి అన్నపు ముద్ద, 
  3. ఒక బెల్లపన్నపు ముద్ద, 
  4. ఒక త్రిమదుర ద్రవం,
  5. పెరుగన్నపు ముద్ద, 
  6. పులగం, 
  7. ఒక పులిహోర అన్నపు ముద్ద (ఒకటవ నెలనుండి ఇప్పటివరకూ ఏ ఆహార నియమాలని పాటించాలో ఆ అన్నిటికీ కొద్ది కొద్ది పరిమాణం చొప్పున తీసుకుంటూ మొత్తం కలిపి రెండు ముద్దలకి మించకుండా) తింటూ ఉండాలి. నెలంతా నైవేద్యమయ్యాక ఈ ముద్దల్ని స్వీకరించాక ఈ క్రింది నామాలని మననం చేసుకుంటూ వుండాలి.
సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ
సర్వౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ!!
సప్తమే మాసే జీవసంయుక్తో భవతి” – అని ఉపనిషత్తు చెప్తోంది. కాబట్టి ఏడవనెలలో జీవుని ప్రవేశం జరిగి 8,9 నెలలలో గిర్రున తిరగడం ప్రారంభమౌతుందన్నమాట. ఇక్కడితో ఆహార నియమాలు పూర్తయినట్లే. 
7వ మాసంలో శిశువుని రక్షించే ఆ తల్లి పేరు “యాకినీదేవి”.

No comments:

Post a Comment